నేలకొండపల్లి పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక హర్షణీయం

పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో గురువారం శ్రీ వాసవి భవన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకోచ్చిని ధరణి పోర్టల్ రైతులకు ఉపయోగపడలేదన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.