బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పాలేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కదం తొక్కాలని, గులాబీ సైన్యం కవాతుతో వరంగల్ దద్ధరిల్లాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. రజతోత్సవ సభకు సన్నాహకంగా గురువారం సాయంత్రం తిరుమలాయపాలెంలో పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.