డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

52చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని కొట్టు బాల్య కిరాణం సెంటర్ నందు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. డ్రైనేజీ కాల్వల్లో మురికి నీరు దిగువకు వెళ్లకుండా నిల్వ ఉండడంతో దోమలకు నిలయంగా మారిందని చెప్పారు. అటు డ్రైనేజి కాలువల్లో భారీగా చెత్త పేరుకుపోయిందని తెలిపారు. దీని వల్ల దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్