ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ మనసా వాచా అంబేద్కర్ ఆలోచనలకి, రాజ్యాంగానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత మోడీదని తెలిపారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మభ్య పెడుతుందని అన్నారు.