కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామికి మంగళవారం పూజలు నిర్వ హించారు. మహోత్సవ వేడుకల చివరి రోజు సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాయల రమణయ్య, మండల అధ్యక్షులు రాయల వీరన్న, పురోహితులు శాస్త్రి శర్మ, బండి ఎల్లయ్య, చల్ల వీరన్న, దేవేండ్ల కొండ పాల్గొని పూజలు నిర్వహించారు. తీర్థ ప్ర సాదాలను స్వీకరించారు.