విద్యార్థులు శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిలాఖాన్ సూచించారు. గురువారం ఖమ్మం ఐటీ హబ్ ను సందర్శించిన ఆయన కంపెనీల కార్యకలాపాలపై ఆరా తీశారు. అనంతరం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, లెర్నెట్ స్కిల్స్ జనరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతస్థాయికి చేరేందుకు పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు.