ఖమ్మం లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్న నేపథ్యాన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ వీ.పీ. గౌతమ్ వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆదివారం ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి కోల్టే, లెక్కింపు పరిశీలకులు ప్రేదిమాన్ కృషన్ భట్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి పరిశీలించాక వివరాలు వెల్లడించారు.