ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15, 500, అటు కొత్త మిర్చి ధర రూ. 15, 800గా జెండాపాట పలికింది. అలాగే, క్వింటాల్ పత్తి ధర రూ. 7, 150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర, ఏసీ మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, అటు పత్తి ధర మాత్రం రూ. 50 తగ్గినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.