ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు ఆందోళన చేశారు. శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద ప్లకార్డులు చేతపట్టి నిరసనలో పాల్గొన్నారు. డిఎస్సీని మూడు నెలలు వాయిదా వేసి ఖాళీగా ఉన్న 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.