ఈనెల 21, 22 తేదీల్లో టీయుసీఐ ప్రథమ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, రాష్ట్ర నాయకులు అశోక్ కుమార్ అన్నారు. సోమవారం వైరాలోని విక్రమ్ భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని అన్నారు.