పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: పోలీస్ కమిషనర్

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ లో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించిన వసతి గదులను బుధవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్య్రమంలో జిల్లా పోలీస్ అధికారులు తదతరులు పాల్గొన్నారు.