అనుమానాస్పద స్థితిలో ఓ హిజ్రా మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముసలిమడుగు గ్రామ శివారులో ఓ హిజ్రా అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.