సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదుల రూపంలో అందజేయాలని కలెక్టర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10: 30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.