ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్, ముదిగొండ, చింతకాని మండలాల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణకు సంబంధించిన ముఖ్య అంశాలను గురించి ప్రసంగించారు.