ఇప్పటికే జాప్యమైనందున ఇకనైనా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం జానకీపురం, ఎర్రుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇటీవల ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. అలాగే, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ పేరిట కాలయాపన చేయొద్దని సూచించారు.