ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.