ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిర పట్టణంలో 128 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న అండర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.