ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో పర్యటించి అనంతరం రైతు భరోసా కార్యక్రమంపై అధికారులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు.