ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4: 00 నుండి డయల్ యువర్ ఆర్టీసీ డి. ఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మధిర డిపో మేనేజర్ శంకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను సూచనలను అందించవలసిందిగా తెలియజేశారు.