ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని మదర్ థెరీసా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక దివ్యాంగుల కేంద్రానికి గురువారం మధిర సేవా సమితి సభ్యులు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణగా అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సదనం నిర్వాహకులు మానవతా దృక్పథంతో స్పందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.