మధిర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కళా పరిషత్ అధ్యక్షులు గడ్డం సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాపరిషత్తుగౌరవ అధ్యక్షులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.