మధిర శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో మధిర పరిధిలోని మహాదేవపురం గ్రామంలోని సుమారు 1000 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకం ప్రారంభ దశకు చేరుకున్నది. ఆ పనులను శుక్రవారం ఇరిగేషన్ శాఖ డిఈ నాగ బ్రహ్మం, డిప్యూటీ సీఎం వ్యక్తిగత సహాయకులు రాజేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషోర్, తదితరులు పరిశీలించారు.