మధిర మండలంలోని వంగవీడు గ్రామంలో ఐ. కే. పి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.