ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీ డీసీసీబీ నేలకొండపల్లి బ్రాంచ్ పరిధిలో 1, 230 మంది రైతులకు వర్తించింది. ఈమేరకు బ్రాంచ్ మేనేజర్ టి. ఇందు వివరాలు వెల్లడించారు. బ్రాంచ్ పరిధిలో తొమ్మిది సొసైటీలు, బ్యాంకు బ్రాంచ్ ద్వారా రూ. 1. 50లక్షల వరకు రుణాలు ఉన్న 1, 230 మంది రైతులకు రూ. 5, 89, 22, 570 కోట్లు మాఫీ అయిందని తెలిపారు. ఆయా రైతులు తిరిగి రుణాలు పొందేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.