ఆగస్టు 5 నుంచి 9వరకు రాష్ట్రంలో పారిశుధ్యం పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.