గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్న్ జిల్లా నాయకుడు తిమ్మిడి హనుమంతరావు అన్నారు. బుధవారం తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఆ పార్టీ మండల నాయకుడు ఎన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గోడ పత్రికలు ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెన్నబోయిన శ్రీనివాసరావు, శ్రీను, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.