నేలకొండపల్లి మండలంలోని కూసుమంచి రహదారిలో హిజ్రాలు వాహనాలు ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు నేలకొండపల్లి ఎస్ఐ తోట నాగరాజు హిజ్రాలను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక నుంచి మండలంలో ఎక్క డైనా వాహనాలు ఆపి డబ్బులు అడిగితే సహించేది లేదని హెచ్చరించి పంపించారు.