ఏదులాపురం సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్ పై పలు ఫిర్యాదులు రైతుల నుంచి అందడంతో డీసీవో గంగాధర్ విచారణాధికారులను నియమించారు. విచారణాధికారులుగా వచ్చిన ఉషశ్రీ, రాంరెడ్డిలు గురువారం సొసైటీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. నేరుగా రైతుల చేత వాంగ్మూలం చేపట్టారు. రైతులు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైర్మన్ లక్ష్మణ్ మాయమాటలు చెప్పి అక్రమంగా డబ్బులు తీసుకున్నారని అధికారులకు తెలిపారు.