హైద్రాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్, వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈక్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీహాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేసారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులపై పోలీసుల దాడులు నాశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటాని ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు.