ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు చిలివేరు బాబు అతని అనుచరులు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నేత బాబు, వారి అనుచరులకు మంత్రి కాంగ్రెస్ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.