ఖమ్మం నగరంలోని బస్టాండ్ , రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించారు. పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా ఈ ట్రస్ట్ ను కుమ్మర కులస్తులంతా ఏకమై ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.