రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రజల్లో అవగాహనకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సమావేశం నిర్వహించారు.