
ఈ మామిడి పండు ధర జస్ట్ రూ.900 మాత్రమే!
మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో మాత్రమే పండే ‘నూర్జహాన్’ రకం మామిడి పండ్లు మంచి రుచి, భారీ పరిమాణంలో ఉంటాయి. ఒక్క మామిడి పండు బరువు 3 కిలోల వరకు ఉండగా.. కిలో రూ.300. అంటే ఒక్కటి రూ.900 అన్నమాట. రాజవంశ కాలం నుంచే మనుగడలో ఉన్న ఈ రకం మామిడిపళ్లను ఆదిలాబాద్ జిల్లా కోర్టు దారిలో బుధవారం విక్రయించారు. కొన్ని పండ్లు 5 కిలోల బరువుతో కూడా ఉన్నట్లు ఉద్యాన అధికారి జి. సందీప్ కుమార్ తెలిపారు.