కూసుమంచి: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు

ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టం వస్తుందని చెప్పారు. ఆదివారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమయ్యారు.