పోగొట్టుకున్న 13 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు ముదిగొండ ఇన్స్పెక్టర్ మురళీ తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో మొబైల్ ఫోన్ ట్రాక్ చేసిన సైబర్ సెల్ బృందం సిపి సునీల్ దత్ సూచనలతో ముదిగొండ పోలీస్ స్టేషన్ లో యజమానులకు ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా అప్పగించారు.