నేలకొండపల్లి మండలంలోని కోరట్లగూడెంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలు అమలు చేస్తోందన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, కొత్తపల్లి సుబ్బయ్య ఉన్నారు.