కూసుమంచి మండల సబ్ రిజిస్ట్రార్ గా యం. పద్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం ఆర్వో నుండి కూసుమంచికి బదిలీ అయ్యారు. ఇప్పటివరకు కూసుమంచిలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వర్తించిన జే. రామనర్సింహారావు వరంగల్ ఆర్వోగా బదిలీ అయ్యారు. నూతన సబ్ రిజిస్ట్రార్ కు సిబ్బంది, అధికారులు తదితరులు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.