స్వీపర్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. గత ప్రభుత్వం తొలగించిందని ఆయన తెలిపారు. శుక్రవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో స్వీపర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సాంబశివరావుకు వినతి పత్రం సమర్పించారు.