రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రమంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలతో నష్టపోయిన వ్యవసాయ రంగం గురించి వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.