పినపాక రైతు వేదికలో నల్ల బ్యాడ్జీలు ధరించి వ్యవసాయ శాఖ అధికారులు విధులకు మంగళవారం హాజరయ్యారు. రైతు వేదిక ఎదుట అధికారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ క్రాప్ సర్వే క్లస్టర్ మొత్తం ఒక ఏఈవో చేయటం కష్టతరమైనదని అధికారులు అన్నారు. కావున ఇట్టి డీసీస్ సర్వే కొరకు గ్రామ స్థాయిలో సహాయకులను నియమించాలని పేర్కొన్నారు.