కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీవో రాజేందర్ గౌడ్ అన్నారు. కేంద్రాల్లో కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆయా మండల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని వివరించారు. రైతులు అధైర్య పడొద్దని సూచించారు.