లిఫ్ట్ ఇరిగేషన్లతో పుష్కలంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామని TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శనివారం ఆయన కల్లూరు మండలం లింగాలలో విలేకరులతో మాట్లాడారు. లిఫ్ట్ లకు మరమ్మతులు అవసరమైతే నిధుల కోసం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే సీజన్ నాటికి సీతారామ ప్రాజెక్టు నీరు అందుతుందన్నారు.