కల్లూరు: దాతలు ముందుకు రావాలి

70చూసినవారు
కల్లూరు: దాతలు ముందుకు రావాలి
ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి వేసవిలో స్వాంతన కల్పించాలనే సంకల్పంతో వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు దాతల సహకారంతో కల్లూరు పట్టణ ఆర్టీసీ బస్టాండ్ లో చేస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం గురువారంతో 30వ రోజుకు చేరింది. కల్లూరు పట్టణంలో గల శాంతినగర్ కు చెందిన మల్లాది చిన్న ప్రసాద్ - రాశి దంపతులు తమ కుమారుడు మల్లాది తేజేంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని మజ్జిగతో పాటు ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్