కల్లూరు మండలం యజ్ఞనారాయణపురంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. నందమూరి, టీడీపీ అభిమానులు స్తానిక ప్రధాన రహదారిపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీలకతీతంగా నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.