ఖమ్మం(డి) తల్లాడ(ఎం) కురనవెళ్లికి చెందిన శశిరెడ్డి కుమార్తె అల్లూరి భావన (22) గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. శనివారం ఉదయం కాలేజీలోని హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.