మంత్రి తుమ్మలను కలిసిన మండల కాంగ్రెస్ నేతలు

80చూసినవారు
మంత్రి తుమ్మలను కలిసిన మండల కాంగ్రెస్ నేతలు
కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర రెండో విడతలో రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో నాయకులు మంత్రి తుమ్మలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మండలంలో నెలకొన్న పలు సమస్యలను మండల నాయకులు బొప్పన శ్రీనాథ్ చౌదరి మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్