రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిలాఖాన్ అధికారులను ఆదేశించారు. పెనుబల్లి మండలం మండాలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, రవాణాపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కాంటా వేయించి మిల్లులకు తరలించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య ఉన్నారు.