గురువారం పెనుబల్లి మండల పరిధిలోని విఎం బంజర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను తహశీల్దార్ గంటా ప్రతాప్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రైతులు పండించిన వరి పంటకు బోనస్ ఇస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలాద్రిశ్వర దేవస్థానం చైర్మన్ చీకటి చిన్న నరసింహారావు, విఎం బంజర్ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మిట్టపల్లి కిరణ్ కుమార్, మేకతోటి కాంతయ్య పాల్గొన్నారు.