లగచర్లలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం కల్లూరులో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ మాట్లాడుతూ. రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి, జైలులో పెట్టడం సరికాదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలుపాలన్నారు.