సత్తుపల్లి మండలం రేజర్లలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమాచార్య ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆరాధన, అష్టోత్తర పూజ, సేవా కాలం అనంతరం పాయసం తయారుచేసి ద్రావిడ మీద సేవాకాలాన్ని పూర్తిచేశారు. అనంతరం భక్తుల అందరితో ఆదిత్య హృదయం ఉపదేశ పూర్వకంగా పారాయణం చేయించారు. ధర్మకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.